లోకేష్ స్కెచ్..నందమూరి-మెగా ఫ్యాన్స్ సపోర్ట్!

-

నారా లోకేష్ ఇప్పుడుప్పుడే పక్కా రాజకీయ నాయకుడుగా ఎదుగుతున్నారనే చెప్పాలి. నాయకులు మాదిరిగానే ఆయన ప్రజలని ఎలా ఆకర్షించాలి..వారి మద్ధతు ఎలా పెంచుకోవాలనే అంశంపై పకడ్బంధిగా వెళుతున్నారు. గతంలో లోకేష్ ఇలా ఉండేవారు కాదు..సరిగా మాట్లాడటం కూడా వచ్చేది కాదు. ఆయన తప్పులు మాట్లాడటం వైసీపీ విపరీతంగా ట్రోల్స్ చేస్తూ వచ్చింది. దీని వల్ల టి‌డి‌పికి డ్యామేజ్ జరిగింది. కానీ ఎన్నికల్లో ఓడిపోవడం, లోకేష్ లో మార్పు వచ్చింది. మాట తీరు మారింది..బాడీ లాంగ్వేజ్ మారింది.

తనపై సెటైర్లు వేసేవారిపై కౌంటర్లు ఇవ్వడంలో లోకేష్ పట్టు సాధించారు. అలాగే తన పంచ్ లతో ప్రత్యర్ధిలపై విరుచుకుపడుతున్నారు. ఇక పాదయాత్రతో లోకేష్ పక్కా నాయకుడు మాదిరిగా ముందుకెళుతున్నారు. పాదయాత్రలో జనంలో కలిసిపోతున్నారు. అయితే లోకేష్ ఒక టెక్నిక్ పట్టారు. ఏ ప్రాంతంలో పాదయాత్ర చేస్తే ఆ ప్రాంతానికి తగ్గట్టు యాస బాష మార్చేస్తున్నారు. ప్రజలని ఆకట్టుకోవడానికి అక్కడ స్థానిక యాసలోనే మాట్లాడుతున్నారు. దీంతో లోకేష్ స్పీచ్‌ల్లో మార్పు వచ్చింది. యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు..వారిని అక్కట్టుకునే పనిలోనే లోకేష్ ఉన్నారు.

lokesh

ఇదే సమయంలో యువతతో లోకేష్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు. తాజాగా యువతతో లోకేష్ మాటామంతీ కార్యక్రమం చేపట్టారు. ఇక యువత తమదైన శైలిలో ప్రశ్నలు అడిగితే..లోకేష్ సమాధానాలు ఇచ్చుకుంటూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్ధి ఈ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్న సంధించగా, లోకేష్ దానికి సమాధానం ఇస్తూ..తన ఫేవరెట్ హీరో చిరంజీవి అని, కానీ ముద్దుల మావయ్య వైపే ఉండేలా కదా..బాలయ్య మావ సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అని చెప్పుకొచ్చారు.

అలాగే పవన్, జూనియర్ ఎన్టీఆర్‌ల గురించి సైతం మాట్లాడి యువతని ఆకట్టుకున్నారు. అంటే అటు నందమూరి, ఇటు మెగా ఫ్యాన్స్‌ని ఆకట్టుకునేలా లోకేష్ మాట్లాడారు. దీంతో ఇద్దరు ఫ్యాన్స్‌ని కవర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news