ఎన్సీపీలో లుకలుకలు.. అజిత్ పవార్ రియాక్షన్ ఏంటంటే..?

-

ఎన్సీపీలో లుకలుకలు మొదలయ్యాయని వస్తున్న వార్తలపై మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. ఆయన అసంతృప్తితో ఉన్నారంటూ వచ్చిన వార్తలపైనా క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఊహాగానాలేనని నిరాధారంగా వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు.

‘”దిల్లీలో జరిగిన ఎన్సీపీ జాతీయ స్థాయి సమావేశంలో సమయం తక్కువగా ఉండటంతో నేను మాట్లాడలేకపోయా. షెడ్యూల్‌కు తగ్గట్టే వ్యవహరించాను. ఇక ఎప్పటిలాగే నేను అసంతృప్తితో ఉన్నానని మీడియా వార్తలు ప్రసారం చేసింది. అలాంటిది ఏమీ లేదు. ఉదయం నుంచి సమావేశంలో కూర్చున్నాను. నేను కనీసం వాష్‌రూంకు వెళ్లడానికి కూడా లేదా? సమయం లేక నాలాగే పలువురు నేతలు మాట్లాడలేదు. దానర్థం అంతా అసంతృప్తిగా, ఆగ్రహంగా ఉన్నారనేనా? పుకార్ల ఆధారంగా కాకుండా, వాస్తవాలను బట్టి మీడియా వార్తలను ప్రసారం చేయాలని అభ్యర్థిస్తున్నా. పార్టీ నన్నెప్పుడు పక్కన పెట్టలేదు. కీలక పదవులు ఇచ్చింది. నేను అసంతృప్తిగా లేననే విషయాన్ని బాండ్ పేపర్‌పై రాసివ్వాలా?”’ అని తనపై వస్తోన్న ఊహాగానాలకు చెక్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news