సీఎం చంద్రబాబు ఇంటికి అక్కినేని నాగార్జున చేరుకున్నారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి వెళ్లినట్లుగా సమాచారం వివరాల్లోకి వెళితే…. అక్కినేని ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అక్కినేని అఖిల్ మూడుముళ్ల బంధం లోకి అడుగు పెట్టబోతున్నాడు. జూన్ 6వ తేదీన అఖిల్ తన ప్రియురాలు జైనబ్ కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే అక్కినేని ఇంట్లో అఖిల్ వివాహ పనులు ప్రారంభమయ్యాయి.

తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా అక్కినేని నాగార్జున ఏపీ సీఎం చంద్రబాబును ఉండవల్లిలో కలిసి వివాహ పత్రికను అందజేశారు. చంద్రబాబు నాయుడుని కుటుంబ సభ్యులతో కలిసి తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా అక్కినేని నాగార్జున కోరినట్లుగా సమాచారం అందుతుంది. అంతేకాకుండా నాగార్జున ఏపీ, తెలంగాణలోని సినీ నటులు, రాజకీయ నాయకులు అందరి ఇంటికి వెళ్లి అఖిల్ జైనబ్ వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేసినట్లుగా తెలుస్తోంది. వీరి వివాహానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.