25 కోట్ల విరాళం ప్రకటించిన స్టార్ హీరో…!

-

కరోనా వైరస్ నుంచి దేశం బయటపడటానికి ప్రతీ ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎవరూ కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకోవడం లేదు. కరోనా వైరస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వాలు దాని మీద పోరాటం చేయడానికి గానూ తమ వంతుగా కోట్ల రూపాయలను హీరోలు, రాజకీయ ప్రముఖులు సహకారం అందిస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ కూడా సహాయం చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏకంగా 25 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించాడు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి కావాలని ఆకాంక్షిస్తూ అతను ఈ విరాళం ప్రకటించడంపై ఇప్పుడు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోన వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ఒకరి తర్వాత ఒకరు ముందుకి వస్తున్నారు. ఎవరూ కూడా కరోనా వైరస్ విషయంలో అలసత్వం ప్రదర్శించడం లేదు.

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి భారీగా ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు కూడా ముందుకి వచ్చి విరాళాలు ప్రకటించారు. పారిశ్రామిక వేత్తలు కూడా ముందుకి వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది. 20 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news