ప్రభుత్వ విప్‌కు కరోనా.. టీఆర్ఎస్‌లో టెన్షన్..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. పలు పార్టీలకు చెందిన కీలక నేతలకు సైతం కరోనా సోకింది. తాజాగా.. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ఇవాళ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

దీంతో ఆమె హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సందర్భంగా తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి తెలిపారు. కరోనా ప్రారంభ దశలోనే ఉందని, వైద్యం కొనసాగుతోందని చెప్పారు. అయితే ఆమె భర్త మహేందర్ రెడ్డి కరోనా టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news