చంద్రబాబుకి వచ్చిన బెయిల్‌ మానవతా దృక్పథంతో ఇచ్చింది మాత్రమే : అంబటి

-

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో న్యాయం గెలిచింది అంటూ టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ అంశాలపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. చంద్రాబాబుకు ప్రత్యేక పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చారు..దీనిపై చాలా హాంగామా చేస్తున్నారు అంటూ సెటైర్లు వేశారు. నిజం గెలిచింది అంటున్నారు కానీ ఇంకా నిజం గెలవలేదు..కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఈ మాత్రందానికే ఇంత హంగామానా..? అంటూ ప్రశ్నించారు.

Ambati Rambabu : అంబటికి ఖమ్మంలో చేదు అనుభవం.. | Ambati Rambabu faced  negitivity in Khammam PVCH

చంద్రబాబుకి వచ్చిన బెయిల్‌ మానవతా దృక్పథంతో ఇచ్చింది మాత్రమేనని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చారని, దీనిపై టీడీపీ ఎందుకంత హంగామా చేస్తుందని ఆయన మండిపడ్డారు. బాబు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మాత్రమే బెయిల్ వచ్చిందన్నారు. వస్తున్నా.. మీ కోసం కాదు..! వస్తున్నా కంటి ఆపరేషన్ కోసం అని మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు. కళ్లు కనిపించకే మధ్యంతర బెయిల్‌ ఇచ్చారు.. కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనంటూ ఆయన విమర్శించారు. విజనరీ లీడర్ కి.. విజన్ సరిచేసుకోమని బెయిల్ ఇచ్చారు!.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. అయితే, తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయం అయింది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇతర పార్టీల గెలుపు కోసం పార్టీని తాకట్టు పెట్టడం అనైతికమని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల ముందో, ఆ తర్వాతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా టీడీపీ జెండా పీకేస్తారని ఆయన విమర్శలు గుప్పించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news