అసెంబ్లీకి రావడం చాతకాదు..కానీ టాక్ షోకి హాజరవుతాడు – అంబటి రాంబాబు

-

అసెంబ్లీకి రావడం చాతకాదు..కానీ టాక్ షోకి హాజరవుతాడని బాలయ్యపై అంబటి రాంబాబు సెటైర్లు పేల్చారు. బాలయ్య షోకు లక్ష్మీ పార్వతిని, నాదెండ్ల భాస్కర్‌ను కూడా పిలిచి ఉండే బాగుండేదని చురకలు అంటించారు. చంద్రబాబు పతనం అన్‌స్టాపబుల్, లోకేష్ పతనం అన్‌స్టాపబుల్, టీడీపీ పతనం అన్‌స్టాపబుల్ అని… 175 సీట్లు వైసీపీ సాధించటం ఖాయమన్నారు అంబటి.

ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి హాజరుకాడు…కానీ బాలకృష్ణ టాక్ షోకి హాజరవుతాడు.. ఈ స్థాయికి దిగజారిన తర్వాత ఏం మాట్లాడతామని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్ళి చేసుకోవడంలో లాజిక్ ఉంది, అర్ధం ఉందని.. ఇంత మం ది పిల్లలు ఉన్నా ఒక్కరైనా కనీసం మంచి నీళ్ళు అయినా ఇచ్చారా?? అని బాలయ్యపై నిప్పులు చెరి గారు. బాలకృష్ణ టాక్ షోలో చంద్రబాబు కుమారుడుతో సహా పాల్గొన్నారని.. బాలకృష్ణ, చంద్రబాబు బా వ బావమరుదులు, లోకేష్, బాలకృష్ణ మామా అల్లుళ్ళు.. ఒక బంధువర్గం కూర్చుని మాట్లాడుకున్నారని సెటైర్‌ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news