ఏపీలో దారుణం.. 8వ తరగతి విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌.. ఫోన్‌లో వీడియోలు తీసి

-

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న విద్యార్థులు ఆఘాయిత్యాలకు ల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. అలాంటి ఘటనే ఇది. 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే.. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలోని గోపవరం మండలం రాచాయపేటలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా బాలికను నగ్నంగా వీడియో చిత్రీకరిస్తూ పలుమార్లు అత్యాచారం చేసినట్లు సమాచారం. అయితే.. అత్యాచారానికి పాల్పడింది టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. అయితే.. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు.

ఇదిలా ఉంటే.. నిన్న ఒంగోలులో దారుణం జరిగింది. కొత్తపట్నం మండలానికి చెందిన మహిళ (30) ఒంగోలులో కూరగాయల వ్యాపారం చేసుకుంటోంది. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని స్వస్థలానికి స్కూటీపై పయనమైంది. గుత్తికొండవారిపాలెం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను కొందరు దుండగులు పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. గురువారం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ మల్లికాగర్గ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news