జగన్, విజయసాయికి అమిత్ షా గుడ్ న్యూస్…!

-

ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్ లో సిబిఐ జెడిగా నియమించాలని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా కు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖపై అమిత్ షా స్పందించారు. గతంలో సిబిఐ జేడీగా పని చేసిన లక్ష్మీ నారాయణ చంద్రబాబు కనుసన్నల్లో పని చేసారని, ప్రస్తుత హైదరాబాద్ సీబీఐ జేడీ కృష్ణ సైతం తెలుగు వ్యక్తని, ఆయన రాజకీయాలతో ముడి పడి ఉన్న అధికారని,

కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారని, తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కానీ ఆయన తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే అన్నారు.

ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయన్నారు. లక్ష్మీనారాయణతో పలు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయన్నారు. లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న కాలంలో ఆయన ఎస్పీగా పని చేశారని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమించాలని విజయసాయి కోరారు.

దీనిపై స్పందించిన అమిత్ షా విజయసాయిరెడ్డి లేఖపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు సూచించారు. ఈ మేరకు సంబంధిత లేఖను విజయసాయిరెడ్డికి కూడా అమిత్ షా కార్యాలయం ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం కోర్ట్ కి హాజరైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news