దేశప్రధాని మళ్ళీ మోదీనే ఇదిగో ప్రూఫ్ …?

-

ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో ఉంటూ ప్రధాని మోదీ అడుగుజాడళ్లలో పాలనను సాగిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల గురించి దేశమంతా చర్చ జరుగుతున్న వేళ బీజేపీ మాత్రం చాలా నమ్మకంగా ఉంది. వచ్చే ఎన్నికలలోనూ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని టీం అంతా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక తాజాగా దేశ హోమ్ శాఖ మినిస్టర్ అమిత్ షా వచ్చే ఎన్నికల గురించి ఒక జోస్యం చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చి మళ్ళీ ప్రధానిగా మోదీనే అవుతారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు అమిత్ షా. రాబోయే 2027 సంవత్సరానికి ఇండియా ప్రపంచంలోనే 3వ ఆర్ధిక వ్యవస్థగా మారుతుంది అంటూ అమిత్ చెప్పారు.

ఎన్నో ఉపయోగాలను చేసిన బీజేపీని ప్రజలు నమ్ముతున్నారు, ఆ నమ్మకం రేపు ఓట్ల ద్వారా వేసి మమ్మల్ని గెలిపించుకుంటారని చెప్పారు అమిత్ షా. మరి ఈఆయన భారత ప్రజలపై పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపిస్తారా ? ఓడిస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version