బంజారాహిల్స్ ఆర్కే సినీ మ్యాక్స్‌లో ప్రమాదం..కేసీఆర్ సర్కార్ కీలక ఆదేశాలు

-

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఆర్కే సినీమాక్స్‌ లో ప్రమాదం చోటు చేసుకుంది. గాంధీ సినిమా చూసేందుకు వెళ్లిన భారతీయ విద్యా భవన్‌కు చెందిన 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే.. ఆర్కే సినీ మాక్స్‌ లో ‘గాంధీ’’ సినిమాను చూసేందుకు వచ్చి ప్రమాదానికి గురైన భారతీయ విద్యాభవన్ పాఠశాల విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టరును ఆదేశించారు.

గురువారం నాడు భారతీయ విద్యాభవన్ పాఠశాల విద్యార్థులు సినీ మాక్స్‌లోని ‘గాంధీ’’ సినిమాను చూసేందుకు వచ్చి, ఎస్కలేటర్ పై వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిసిందని మంత్రి అన్నారు. ప్రమాదానికి గురైన విద్యార్థులకు చికిత్స అందిస్తున్న అపోలో ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని పాఠశాల విద్య సంచాలకులు దేవసేనను మంత్రి ఆదేశించారు.

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాల సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు గాంధీ చిత్ర ఉచిత ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ‘గాంధీ’’ సినిమా ప్రదర్శన సందర్బంగా మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news