సర్కారు వారి పాట సినిమాపై ఆనంద్ మహీంద్ర ట్వీట్

-

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు,కీర్తి సురేష్ జంటగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట.” ఈ మూవీ మే 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయి ఘన విజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా తాజాగా 200 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు విలన్ సముద్రకనికి వార్నింగ్ ఇవ్వడానికి బయలుదేరే సన్నివేశం తో పాటు మరో రెండు మూడు సన్నివేశాల్లో జావా మెరూన్ బైక్ డ్రైవ్ చేసిన విషయం తెలిసిందే.

మహేంద్ర గ్రూప్ కు చెందిన క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ జావా బైక్స్ ను తయారు చేస్తోంది.” సర్కారు వారి పాట”లో జావా బైక్ మీద మహేష్ బాబు ఉన్న విజువల్స్ ను క్లాసిక్ లెజెండ్స్ కో- ఫౌండర్ అనుపమ్ ట్వీట్ చేయగా, మహేష్ బాబు, జావా కాంబినేషన్ చూడడం తాను ఎలా మిస్ అయ్యాను? ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నానని, న్యూజెర్సీలో సర్కారు వారి పాట మూవీ చూస్తానని ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news