ఇవాళే ఏపీ బడ్జెట్ సమావేశాలు.. చంద్రబాబు లేకుండానే అసెంబ్లీలోకి టీడీపీ

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 2022-23 బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసన మండలి మరియు శాసన సభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించిన మాజీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి నివాళులర్పించి మార్చి 8న సభ సంతాప తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి మార్చి 11న బడ్జెట్‌ను ప్రవేశపెడతారని భావిస్తున్నారు. గత సంవత్సరం, కోవిడ్-19 మహమ్మారి కారణంగా శాసనసభ బడ్జెట్ సమావేశాల వ్యవధిని గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ సమర్పణతో సహా ఒక రోజుకు కుదించింది. అయితే ఈ ఏడాది ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను సరైన ఫార్మాట్‌లో ప్రవేశపెట్టనుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఇవాళ ఉదయం సమావేశమై బడ్జెట్ సెషన్‌ల వ్యవధిని నిర్ణయిస్తుంది. ఇక ఈ బడ్జెట్‌ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరు అవుతున్నారు కానీ… చంద్రబాబు మాత్రం హాజరు కావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news