ఈ ఎన్నికలు చంద్రబాబు, జగన్ కి కాదు.. ఎవరెవరికీ అంటే..?

-

ఈ ఎన్నికలు చంద్రబాబు, జగన్ కి కాదు అని సీఎం జగన్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు సీఎం జగన్.  ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ ప్రజల పక్షం అని గర్వపడుతున్నాను. ఈ యుద్ధంలో దత్తపుత్రుడు, ఎల్లోమీడియా కాకుండా.. ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ.. ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నయం ఇవ్వకుండా మరో పార్టీ.. వీరందరూ యుద్ధం చేస్తున్నారు.

కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద ఇన్ని జెండాలు, ఇన్ని కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు అక్కాచెల్లెమ్మలు, అవ్వతాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు వీరందరినీ రక్షించేందుకు మీరంతా సిద్ధమేనా..? అని అడిగారు సీఎం జగన్. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు డబుల్ సెంచరీ సాధించేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో మీకు మంచి జరిగింది అనేది ఆలోచించిన తరువాత మీరు నిర్ణయం తీసుకోవాలని సూచించారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news