వైఎస్ఆర్ కి జగన్ వారసుడు ఎలా అవుతాడు..? షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

-

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకే అన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టేది బీజేపీ అని విమర్శించారు. వైఎస్సార్ కొడుకు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఎద్దేవా చేశారు. ముస్లింలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని విమర్శించారు. బీజేపీకి కట్టు బానిస అయిన జగన్.. వైఎస్సార్ కి వారసుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు.

ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు చేశాడు.. ఇమామ్లకు రూ.15 వేల వేతనం, ముస్లిం బ్యాంకు, చనిపోతే రూ.5 లక్షల బీమా అంటూ ఇలా అనేక హామీలు ఇచ్చి విస్మరించాడని గుర్తుచేశారు. ఎప్పటికైనా ముస్లింల పక్షాన నిలిచేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. జగనే కాదు.. చంద్రబాబు కూడా ముస్లింలకు న్యాయం చేయలేదని.. ఏనాడూ ముస్లింల కోసం ఆలోచించలేదని మండిపడ్డారు. వీళ్లంతా బీజేపీకి బానిసలు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news