రాష్ట్ర ప్రజల కోసమే తగ్గాను : పవన్ కళ్యాణ్

-

వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేనాని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పిఠాపురంలో కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసమే తాను తగ్గానని తెలిపారు. జనసేన-టీడీపీ కలిసి ముందుకు వెళ్తేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని అన్నారు. నాయకుల మధ్య ఇబ్బందులు ఉంటే సర్దుకుపోవాలని.. పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నారు.

జగన్ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. మూడు పార్టీల మధ్య ఇప్పటికే సీట్ల పంపకం సైతం పూర్తైంది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. జనసేన పోటీ చేయనున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పవన్ అభ్యర్థులను ఎంపికను పూర్తి చేశారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో నేతల మధ్య సమన్వయం కోసం ఆదివారం జనసేన ఎన్నికల పర్యవేక్షణ కమిటీని సైతం ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఇక, పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news