చంద్రబాబు ఎప్పుడు ఎవ్వరితో ఎలా మాట్లాడుతున్నాడో అర్థం తెలియడం లేదు : మంత్రి మేరుగు నాగార్జున

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బరి తెగించి మాట్లాడుతున్నాడని మంత్రి మేరుగు నాగార్జున ఫైర్ అయ్యారు. తాాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులు, బీసీలపై చంద్రబాబు దారుణంగా మాట్లాడి ఆయన కనీసం క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. ప్రస్తుతం దళితులు, బీసీల ఓట్ల కోసం పాకులాడుతున్నాడని పేర్కొన్నారు. గతంలో టిప్పర్ డ్రైవర్ అయిన దళితుడిని అవమానించారని.. ఇప్పుడు కూలి ఎనం అంటూ ప్రజలను అవహేళనగా మాట్లాడుతున్నాడు.

అసలు చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని ఎస్సీ, బీసీ కాలనీలకి వెళ్తాడని ప్రశ్నించారు. జనం చంద్రబాబుని నమ్మడం లేదు. అందుకే ఆయన సభలకు జనం రావడం లేదని తెలిపారు. చివరి అస్త్రంగా సీఎం జగన్ ని అంతమొందించాలని చూశాడు. వంగవీటి రంగ, పింగళి దశరథ, రామయ్యని చంపిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. చంద్రబాబు అహంకారానికి ప్రజలు ఓడించి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news