జంగారెడ్డి గూడెం మరణాలపై నాగబాబు సంచలనం…. నేనే ప్రత్యక్ష సాక్షిని అంటూ…

-

జంగారెడ్డి గూడెం మరణాలపై … కల్తీ సారాాపై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీసారా వల్ల చనిపోలేదంటూ… ప్రభుత్వం శాసన సభలో ప్రకటన ఇచ్చిందని.. అయితే నేను లైవ్ గా వెళ్లి చూశానని, అక్కడి కుటుంబాలతో మాట్లాడామని, ఇంతగా ప్రభుత్వం ఎందుకు సమర్థించుకుంటుంతో నాకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. కేవలం పురుషులు మాత్రమే చనిపోయారని, మహిళలు ఎక్కడా చనిపోలేదని, నాటు సారా తీసుకునే వారే చనిపోయారని, కళ్లు పోయి చనిపోయారని నాగబాబు అన్నారు.కలెక్టర్ కూడా బాధిత కుటుంబాలను కల్తీసారతో చనిపోలేదని, సహజంగానే చనిపోయారని చెప్పాలని ఒత్తడి తీసుకువచ్చారని ఆరోపించారు. జనసేన లేదా ప్రజలు ప్రభుత్వం వల్లే చనిపోయారంటే మీరు సమర్థించుకుంటే బాగుండేదని..కానీ మేము అలా అనలేదని, కల్తీ సారా తయారు చేసే వాళ్లను ఎందుకు సమర్థిస్తున్నారంటూ ..? ప్రశ్నించారు. ప్రభుత్వం ఎక్వైరీ వేసి నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేయాలని కోరారు. స్వయంగా నా కళ్లతో చూశాను, నేను మాట్లాడానని నాగబాబు అన్నారు. మీరు మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

https://fb.watch/bXVgRRUtP8/

 

Read more RELATED
Recommended to you

Latest news