సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఇకనైనా అడ్డమైన యాత్రలు మానేయాలి – మంత్రి రోజా

-

అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాల పరిమితితో రాజధానిని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీం తీర్పుపై స్పందించారు మంత్రి ఆర్కే రోజా. సుప్రీం మధ్యంతర ఉత్తర్వుల తర్వాతైనా అడ్డమైన యాత్రలు ఇకనైనా మానెయ్యాలని సూచించారు.

అమరావతి పేరుతో చంద్రబాబు తన బినామీలతో కట్టుకున్న కోట బద్దలు అవుతున్నాయన్నారు. ప్రజల అవసరాల మేరకే సి.ఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటారని.. ఆయన సొంత నిర్ణయాలు కాదన్నారు. 175 సీట్లు మీరే తెచ్చుకుంటే మేము ఏం చెయ్యాలని పవన్ అంటున్నారని.. 2019 లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఏంచేశారో అదే చెయ్యాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ ఇద్దరినీ చూసి జనం ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టి.డి.పి.కి వచ్చే సీట్లు సున్నా అన్నారు ఆర్కే రోజా.

Read more RELATED
Recommended to you

Latest news