జగన్ రెడ్డి సామాజిక న్యాయ విద్రోహి అంటూ అచ్చెన్నాయుడు లేఖ

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయ ద్రోహి అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ బీసీలను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను మోసం చేశారని ఆరోపిస్తూ శనివారం ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఇలా పేర్కొని ఉంది.. 1.బీసీ ద్రోహి జగన్ రెడ్డి.. బీసీలకు 56 కార్పొరేషన్లు, 10 మంత్రి పదవులు ఇచ్చామని అదే సామాజిక న్యాయం అని వైసీపీ మోసపూరిత తీర్మానాలు చేసింది అన్నారు..

2.దళితులకు నమ్మకద్రోహం.. దళితుల సబ్ ప్లాన్ నిధులు రూ. 7200 కోట్లు దారి మళ్ళించి, 11,500 ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు. 3. గిరిజన వంచన.. ఎస్టీ సబ్ప్లాన్ నుండి రూ. 1000 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారు. 81 గురుకుల పాఠశాలను సాధారణ పాఠశాలలుగా మార్చేందుకు కుట్ర చేశారు. 4..మైనారిటీలకు ధోకా.. మైనారిటీ సంక్షేమ నిధులు 1,483 కోట్ల ను కూడా దారి మళ్లించారు” అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news