వాడు నన్ను మోసం చేసి సీఎం అయ్యాడు : మోహన్ బాబు హాట్ కామెంట్స్..!

-

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తాను ఎదగలేకపోయానన్న అసంతృప్తి ఇప్పటికీ ఉందన్నారు. ఒకడు మోసం చేసినందువల్లే తన రాజకీయ జీవితం నాశనం అయిందని అన్నారు. నమ్మక ద్రోహం చేశాడని, ఇద్దరం కలిసి ఓ వ్యాపార సంస్థ పెడితే మోసం చేశాడని తెలిపారు. ఆ తర్వాత అతను సీఎం కూడా అయ్యాడని, చచ్చినపామును కొట్టకూడదు కాబట్టి వదిలేశానంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే అతని పేరు చెప్పాలని తాను అనుకోవడం లేదు అన్నారు.

పరోక్షంగా మోహన్ బాబు మాజీ సీఎం చంద్రబాబుని ఉద్దేశించి అన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బాగుందన్న ఆయన, తన మద్దతు వైసీపీ పార్టీకి ఎల్లప్పుడూ ఉంటుంది అన్నారు. తన విద్యాసంస్థకు రావలసిన బకాయిల విషయంలో జగన్ స్పందించడంతో పాటు, త్వరలోనే నిధులు విడుదల చేస్తాం అని హామీ ఇచ్చారు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news