అమరావతిలో రేపే ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ..

-

అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ ప్రారంభం కానుంది. ఆర్ 5 జోన్ లో పట్టాల పంపిణీ కార్యక్రమం సిద్ధమౌవుతోంది. రేపే ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేయనున్నారు. వెంకట పాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

50 వేల మంది లబ్ధిదారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు సభకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎంపిక చేసిన లబ్దిదారులకు లాంఛనంగా ఇళ్ళ పట్టాలు అందించనున్నారు సీఎం జగన్. అమరావతి ప్రాంతంలో సుమారు 1400 ఎకరాల స్థలాన్ని పేదల ఇళ్ళ కోసం కేటాయించింది జగన్‌ ప్రభుత్వం.

ఇప్పటికే కొన్ని లే అవుట్లలో అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. ఈ మేరకు రేపు ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్.. జగనన్న కాలనీల్లోని పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news