19వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర

-

అమరావతి రైతుల మహాపాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రాజధానిగా అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. 19వ రోజుకు చేరుకున్న పాదయాత్ర.. దెందులూరు నియోజకవర్గం పెరుగ్గూడెం నుంచి ప్రారంభమై ద్వారకా తిరుమల మండలం నక్క పంగిడిగూడెం వద్ద గోపాలపురం నియోజవర్గంలో ప్రవేశించింది. సూర్యచంద్ర రావుపేట, గొల్లగూడెం, తిమ్మాపురం మీదుగా సాయంత్రానికి ద్వారకా తిరుమల వరకు కొనసాగుతుంది. తిమ్మాపురంలో మధ్యాహ్నం 2 గంటలకు రైతులు భోజన విరామం తీసుకుంటారు.

టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్‌ జవహర్‌, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ముక్కిడి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ కె.జయరాజ్‌, ఎం.బాపిరాజు, పలువురు నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. పలు చోట్ల పాదయాత్ర రథానికి స్థానికులు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news