ఏడ్చేవారు రాజకీయాలకు పనికి రారు – అంబటి రాంబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏడ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని… ఏడ్చేవారు రాజకీయాలకు పనికి రారని చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు అన్నారు. 2024 లో మళ్ళీ వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

జగన్‌ వ్యతిరేక శక్తులందరినీ విడిపోనివ్వనని పవన్‌ కల్యాణ్‌ ప్రగల్భాలు పలుకుతున్నారని నిప్పులు చెరిగారు. పవన్‌ కల్యాణ్‌ సీఎం అవడానికి పార్టీ పెట్టారో, చంద్రబాబుని సీఎం చెయ్యడానికి పార్టీ పెట్టారో ముందు తేల్చుకోవాలని అంబటి రాంబాబు చురకలు అంటించారు. నేనేమీ అనకపోయినా ఏదో అన్నట్టు చంద్రబాబు ఏడ్చారన్నారు. గెలుపు ఓటములు, ఒడుదొడుకులు వచ్చినా హీరోలా ఉండేవారే రాజకీయాల్లో ఉంటారు. ఏడ్చేవారు రాజకీయాలకు పనికి రారని చురకలు అంటించారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news