33 ఏళ్లు నిన్ను మోసిన కుప్పానికి నువ్వు ఏం చేశావు?: అంబటి రాంబాబు

-

33 ఏళ్లు నిన్ను మోసిన కుప్పానికి నువ్వు ఏం చేశావు అంటూ చంద్రబాబును ప్రశ్నించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. 33 ఏళ్లు కుప్పంలో శాసన సభ్యుడిగా ఉన్నారని…ఈ మధ్య పదే పదే కుప్పం వెళ్తున్నారని అన్నారు. కుప్పం తన చేతిలోంచి జారిపోతుంది అని భయం పట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు అంబటి. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో చంద్రబాబుకి గెలుపే లేదన్నారు.

మున్సిపల్, జిల్లా పరిషత్, సర్పంచ్.. ఏ ఎన్నికలో అయినా డిపాజిట్లు రాలేదన్నారు. 33 ఏళ్లు నిన్ను మోసిన కుప్పానికి నువ్వు ఏమి చేసావు..? అని ప్రశ్నించారు. గాలేరు, నగరికి జగన్ నిధులు ఇవ్వలేదట…నువ్వేమి చేశావ్? అంటూ మండిపడ్డారు. కనీసం కుప్పం కెనాల్ కూడా పూర్తి చేసుకోలేక పోయావ్ అన్నారు.

అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని.. కుప్పంలో కూడా పార్టీ, ప్రాంతం అనేది లేకుండా సంక్షేమ ఫలాలు అందించారని తెలిపారు. అక్కడి ప్రజలు ఇప్పుడు తమ వాణిని వినిస్తున్నారని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వంగి వంగి నమస్కారం పెట్టాడు…అయినా లాభం లేకుండా పోయిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news