పవన్ కళ్యాణ్‌ పంది మీద.. ఊరేగుతున్న ఓ పిచ్చికుక్క – అంబటి రాంబాబు

-

పవన్ కళ్యాణ్‌ పంది మీద.. ఊరేగుతున్న ఓ పిచ్చికుక్క అంటూ అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. నిన్న భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు. వారాహి పైకి ఎక్కి చిందులు వేస్తున్న ప్రాణాలు కు తెగించానని చెప్తున్నాడని… చంద్రబాబు, నారా లోకేష్ ల పల్లకి లు మోస్తున్న పవన్ కు విప్లవం గురించి మాట్లాడే హక్కు లేదని విరుచుకుపడ్డారు.

ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ను చంద్రబాబు కు అమ్మేశాడు అన్న అనుమానం ఉందని ఆరోపణలు చేశారు. వారాహి పేరు పెట్టుకుని ఆ వాహనం పై నుండి అసత్య ప్రచారాలు,అసభ్య పదజాలం వాడుతున్నాడు…అందుకే పవన్ పంది మీద ఊరేగుతున్న పిచ్చికుక్క అంటున్నామన్నారు అంబటి. పవన్ మాటలు సంస్కార హీనం గా ఉన్నాయని… పవన్ మాటల తో అసాంఘిక శక్తుల ను రెచ్చగొట్టాలని చూస్తున్నాడని నిప్పులు చెరిగారు.యువత అప్రమత్తంగా ఉండండి..పవన్ సిద్ధాంతాలు తెలియని వ్యక్తి అని విమర్శలు చేశారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news