జేసీకి మళ్ళీ షాకిచ్చిన జగన్..ఈసారి ఏ కేసంటే…!

-

వైసీపీ అధికారలోకి వచ్చినప్పటి నుంచి జేసీ ఫ్యామిలీ కి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలు కేసులు నమోదుచేయగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీపై తాడిపత్రి పీఎస్‌లో కేసు నమోదయ్యింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డితో పాటు 32 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కరోనా చికిత్స పూర్తి చేసుకుని హైదరాబాద్ నుంచి అనంత వచ్చిన జేసీకి భారీ ర్యాలీతో కార్యకర్తలు, అనుచరులు స్వాగతం పలికారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఇలా చేయకూడదని ఇది నిబంధనలు ఉల్లంఘించినట్లేనని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు పై జేసీ ఫ్యామిలీ ఇప్పటివరకు స్పందించలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news