అన్నం తినేవాడెవడైనా వాలంటీర్లను తిడతాడా..? – దాడిశెట్టి రాజా

-

ఏలూరు సభలో ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు వైసీపీ మంత్రులు. సోమవారం తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి దాడిశెట్టి రాజా, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. అన్నం తినేవాడు ఎవడైనా వాలంటీర్లను తిడతాడా..? అంటూ దుయ్యబట్టారు.

గడ్డి తినే వాళ్ళు మాత్రమే వాలంటీర్ల పై నోరు పారేసుకుంటారని విమర్శించారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవ చేశారని.. పవన్ కళ్యాణ్ కి రాష్ట్రం మీద అవగాహన లేదని అన్నారు. ఇక మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలను, మహిళా వాలంటీర్లను పవన్ కళ్యాణ్ అవమానించాడని.. ఆయన వెంటనే మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పవన్ కళ్యాణ్ జనాగ్రహానికి గురికావాల్సిందేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news