ఏపీ ప్రజలకు రెడ్ అలర్ట్‌..ఎమర్జెన్సీ కోసం టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల

-

AP Disaster Management Agency on rains: ఏపీ ప్రజలకు రెడ్ అలర్ట్‌..ఎమర్జెన్సీ కోసం టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా కృష్ణానది వరద పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులు గా నమోదు అయింది. ఈ తరుణంలోనే… కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

AP Disaster Management Agency on rains

పడవలు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దు అంటూ హెచ్చరించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. వరద నీటిలో ఈతకు వెళ్ళ డం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్ల కు డయల్ చేయండని… దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండని వెల్లడించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version