ఏపీ విద్యార్థులకు అలర్ట్.. పాఠశాలల పునః ప్రారంభ తేదీ వాయిదా

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యార్థులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల పున ప్రారంభం ని జగన్ సర్కార్ వాయిదా వేసింది. వేసవి సెలవుల అనంతరం జూలై 4వ తేదీన పున ప్రారంభం కావాల్సిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో జూలై 5వ తేదీన రీ – ఓపెన్ కానున్నాయి.

ఈ మేరకు ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ఆజాదిక అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వాతంత్ర విప్లవ వీరుడు అల్లూరి ఘన నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే పాఠశాలల పునఃప్రారంభం తేదీని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. జగన్ సర్కార్ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు అన్నీ జూలై 5వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌. ఇక ఇది ఇలా ఉండగా.. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో.. అన్ని ఏర్పాట్లు చేస్తోంది జగన్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news