Breaking : నేడు జహీరాబాద్‌కు మంత్రి కేటీఆర్‌..

-

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సంగారెడ్డి జిల్లాలో నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని జహీరాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మంత్రి కేటీఆర్‌. నిమ్జ్‌లో ఏర్పాటు చేస్తున్న తొలి పరిశ్రమ స్థాపనకు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేస్తారు. దీనిని వీఈఎం టెక్నాలజీస్‌ సంస్థ 511 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో నిర్మిస్తున్నది.

KTR demands Central Govt to withdraw plans to sell PSU lands in Telangana

అనంతరం వాయు ఈవీ పరిశ్రమను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. మహీంద్రా ట్రాక్టర్లు 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి పూర్తయిన సందర్భంగా కంపెనీలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక స్మారకాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. తర్వాత జహీరాబాద్‌ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news