ఏపీలో ఇవాల్టి నుంచి రెండు పూటల బడులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూలు ఇవాల్టి నుంచి రెండు పూటలా నిర్వహించనున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది ఏపీ పాఠశాల విద్యాశాఖ.

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరికలతో జూన్ 12వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించామని తెలిపింది. ఇక వాతావరణం సాధారణ స్థాయికి రావడంతో ఇవాల్టి నుంచి రెండు పూటలా క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఏడెడ్ స్కూళ్ళ హెడ్మాస్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో రెండు పూటలు క్లాసులు నడవాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news