మరీ దారుణం: లోకేష్ ను బంతాటాడుకుంటున్నారుగా!

-

కరోనా పేరు చెప్పి చంద్రబాబు రూము జూము లకు, చినబాబు లోకేష్ ట్విట్టర్ కు పరిమితమైన అనంతరం.. తాజాగా చినబాబు మాత్రం కాస్త జనాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యమధ్యలో ట్రాక్టర్ లు ఎక్కడం, వాటి ద్వారా భయానక వాతావరణం సృష్టించడం సంగతి కాసేపు పక్కనపెడితే… అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తున్నారు.. ఫలితంగా ఏపీ మంత్రుల చేతిలో బంతాటైపోతున్నారు!

అబద్ధాలు చెప్పినా, నిజాలు చెప్పినా, మోసాలు చేసినా, దగాలకు పాల్పడినా… కొద్దోగొప్పో చంద్రబాబుని ఒక రాజకీయ నాయకుడిలా చూస్తున్నారే తప్ప.. చినబాబు ని మాత్రం అస్సలు రాజకీయ నాయకుడిలా చూడటం లేదు వైకాపా మంత్రులు! చినబాబు మాటలు కూడా అలానే ఉంటున్నాయనుకోండి!! ఈ విషయంలో తాజాగా మైకులందుకున్నారు ఏపీ మంత్రులు కొడాలి నాని.. అనీల్ కుమార్ యాదవ్!

లోకేష్‌ లాంటి వేస్ట్‌ మనిషిని మేం ఎక్కడా చూడలేదు.. వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి.. లోకేష్‌ ఎక్కడ తిరిగినా ఉపయోగం లేదు.. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే లోకేష్‌ కు తగిన బుద్ధి చెబుతాం.. అసలు అలాంటి మనిషి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నట్లుగా కొడాలి నాని ఫైరవగా…

దేశంలోనే రైతుల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించిన నేత జగన్. లోకేష్‌ ముందు ట్రాక్టర్ సరిగా నడపడం నేర్చుకోవాలి. మీపార్టీ నేతలే నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. శాన్ ఫోర్డ్ వీరుడు, పప్పు వీరుడు. మీ తాత, మీనాన్న ముఖ్యమంత్రులైనా మంగళగిరిలో ఓడిపోయావ్.. ఫైనల్ గా నువ్వో “పుష్ప మహారాజ్” అంటూ అనీల్ కుమార్ యాదవ్ ఫైరయ్యారు! ఇలా లోకేష్ పేరు చెబితే చాలు.. ఏపీ మంత్రులు బంతాటాడేస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news