అధికారం ఉందని బలహీనులపై దాడులు చేస్తే ఉద్యమాలు తప్పవు – పవన్ కళ్యాణ్

-

విజయవాడలో రెండో విడత జనావాణి- జనసేన భరోసా కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. భీమవరంలో జూలై 17 వ తేదీ జనవాణి నిర్వహిస్తామని పవన్ తెలిపారు.

రేణిగుంట మండలం తారకరామా నగర్ వాసి తన ఇల్లు లాక్కున్నారని తన బాధను పవన్ కళ్యాణ్ కు తెలియజేశారు. దీనిపై స్పందించిన పవన్ గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని ఎంపీటీసీ లాక్కోవడం దారుణమన్నారు. లాక్కున్న ఇంటిని మళ్ళీ మహిళకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అధికారం ఉందని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తున్నారని.. బలహీనులు పై దాడులు పెరిగితే ఉద్యమాలు వస్తాయని జనసేనాని హెచ్చరించారు. ప్రజలు మిమ్మల్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తారు జాగ్రత్త అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news