నేను విచారణకు హాజరు కాలేను.. సిబిఐకి అవినాష్ రెడ్డి లేఖ

-

నేను విచారణకు హాజరు కాలేనని… సిబిఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. అయితే సిబిఐ నోటీసులు జారీ చేయడంపై తాజాగా అవినాష్ రెడ్డి స్పందించారు. తాను విచారణకు హాజరు కాలేనని సిబిఐకి లేఖ రాశారు.

 

5 రోజుల తర్వాత మీరు ఎప్పుడు పిలిచినా హాజరవుతాను..దర్యాప్తునకు పూర్తి స్థాయిలో నా సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఒక రోజు ముందుగా నోటీసు పంపారు..ముందుగా అనేక కార్యక్రమాలను అరేంజ్‌ చేసుకున్నానని వెల్లడించారు. అందుకే ఇవాళ విచారణకు హాజరు కాలేనని సిబిఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news