అభిమానికే అభిమాని అయిన బాలకృష్ణ.. బెంగ ఎవరికి?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు యువకుడిగా ఉన్నప్పుడు వీరాభిమాని! అలాగే.. కడప జిల్లా బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు కూడా. అయితే అలాంటి బాలకృష్ణ ఇప్పుడు వైఎస్ జగన్ కు వీరాభిమాని అయ్యారు. ఈ విషయంలో బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాకుండా వైఎస్ జగన్ అభిమానులు కూడా ఒక్కసారిగా ఫిదా అయిపోయారు. గతంలో మా లీడర్ అయిన వైఎస్ జగన్.. బాలకృష్ణ అభిమాని… కానీ ఇప్పుడు బాలకృష్ణ.. మా లీడర్ వైఎస్ జగన్ అభిమాని అయిపోయారు అంటూ పండుగ చేసుకుంటున్న సందర్భం. ఆశ్చర్యం. అద్భుతమంటూ ఇరు తెలుగు ప్రజలు ఆనందపడుతున్న వేళ.

అయితే అసలు విషయం ఏమింటంటే… గత ఐదేళ్లలో తనబావ.. నాన్నగారి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ తన నియోజక వర్గం కోసం ఎలాంటి రిక్వస్ట్ లు పెట్టలేదేమోనని ఇప్పడు చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి అట్టే తెలిసిపోతుంది. అయితే ఆ సమయంలో తాను అడగలేకపోయానని.. అడిగినా “చేద్దాం. చూద్దాం అంటారేమో” అనుకొని భయపడి అనుమానం కొద్ది ఎందుకొచ్చిన విషయమంటూ జంకిన బాలయ్యకు.. వైఎస్ జగన్ రూపంలో దక్కిన సువర్ణావకాశమే ఇది. నిజంగా ఇది బావగారైన చంద్రబాబుకు మాత్రం గట్టి చెంపపెట్టు వంటిదేనని ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన బాలయ్య అభిమానులు వీరలెవల్లో మీసం మెలేసి గర్వంగా చెప్తున్నారు.

విషయం ఏమిటంటే.. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. వైఎస్ జగన్ కి లేఖ రాశారు. అందులో భాగంగా “హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలి. అందుకు హిందూపురం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.. కర్ణాటక రాజధాని బెంగళూరుకి దగ్గరగా ఉండటంతో పాటు అనువైన స్థలం కూడా ఎక్కువగా ఉంది” అని లేఖలో పేర్కొన్నారు. అలాగే… హిందూపురంకి మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేయమని లేఖలో తెలిపారు. అంతేకాకుండా హిందూపురం సమీపంలోని మలుగూరు వద్ద మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు హిందూపురం అన్ని విధాలుగా అనుకూలమని కూడా స్పష్టం చేశారు. హిందూపురంలో జనాభా, ఇతర అవసరాల దృష్ట్యా మెడికల్ కళాశాల అవసరం ఎంతైనా ఉందని బాలకృష్ణ. వైఎస్ జగన్ ని కోరడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఐదేళ్లుగా నారా చంద్రబాబు నాయుడికి బాలకృష్ణ కనీసం చెవులో ఊదినా ఆ పనికోసం సరిపోయేదని… కానీ అలా ఎన్నిసార్లు ఊదినా పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు ఇలా బాలకృష్ణ ఏకంగా జగన్ కు లేఖ రాశారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.

అంతేకాకుండా ముఖ్యంగా బాలకృష్ణ.. సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాయడం అంటే వైఎస్ జగన్ స్థాయిని మరింత పెంచేలా ఉందని… ఇది నిజంగా ఒక అభిమానికే అభిమాని అయిన బాలకృష్ణ జీవితంలో చిరస్థాయిలో నిలిచిపోయే సందర్భమని కూడా టాక్ నడుస్తోంది. అలాగే… పచ్చమీడియాకు అతీతంగా.. హిందూపురంపై దృష్టి సారించిన బాలయ్య అందుకు తగిన విధంగా జగన్ కు లేఖ రాశారని కూడా స్పష్టమౌతుంది. నిజంగా ఈ విషయం చంద్రబాబుకు మాత్రం అశనిపాతం వలె గుండెలను పిండేస్తుంది. చంద్రబాబు హయాంలో కనీసం ఇటువంటి అభివృద్ధే కాకుండా ఎటువంటి అభివృద్ధి కోసం బాబు పాటుపడలేదని ఈ విషయంతో స్పష్టమౌతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ సందర్భం నిజంగా వైఎస్ జగన్ అభిమానులు కాలరే ఎగరేసే సందర్భమే!!

Read more RELATED
Recommended to you

Latest news