లక్ష్మీపార్వతి ఓ చీడపురుగు..అందుకే తన్ని తరిమేశారు – బొండా ఉమా

-

గోరంట్ల మాధవ్ రాసలీలపై విజయసాయి ట్వీట్ చేయాలని ఛాలెంజ్‌ చేశారు బొండా ఉమా. చీడపురుగులాంటి లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ ల గురించి మాట్లాడే అర్హత లేదని బొండా ఉమ మండిపడ్డారు. ఇలాంటి పనులు చేసినందుకే ఆనాడు అందరూ కలిసి తన్ని తరిమేసిన విషయం గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు.

వైసీపీ ఎంపీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరు అసహ్హించుకొనేలా ఉందని.. సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. గోరంట్ల మాధవ్ మహిళపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్న న్యూడ్ వీడియో వైరల్ అవుతున్నా.. బుకాయిస్తున్నాడని.. గోరంట్ల మాధవ్ చేసింది తప్పు, అతనిపై చర్యలు తీసుకొండని విజయసాయి ట్వీట్ చేయగలడా? అని ప్రశ్నించారు.

గోరంట్ల మాధవ్ పై ఇప్పటికే అత్యాచారం, హత్యాయత్నం కేసులున్నాయి… ఎన్టీరామారావు కుమార్తె ఉమామహేశ్వరి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూశారని ఆగ్రహించారు. మహిళలపై వేధింపులు, అత్యాచార యత్నాలు చేసినవారికి జగన్ మంత్రి పదవులు ఇస్తున్నారని.. గుండెపోటు అని, లేదు లేదు మర్డర్ అని ఏదైనా చెప్పగలిగే వ్యక్తి విజయసాయి అంటూ ప్రశ్నించారు. జోగిరమేష్ మహిళా వాలంటీర్లను లైంగిక వేధింపులకు గురిచేసినా జగన్ మంత్రి పదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసం..? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news