BREAKING: క్లాస్ రూమ్ లో కత్తులతో పొడుచుకున్న 9వ తరగతి విద్యార్థులు

-

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ ఘర్షణ కాస్త కత్తులతో దాడి చేసుకునేవరకు దారితీసింది. ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ పెరగడంతో చాక్ తో మరో విద్యార్థిని పొడిచాడు రాజానగరానికి చెందిన లోడగాల ఉదయ్ శంకర్.

గానుగూడెం కి చెందిన పింక్ హరి సాయి అనే విద్యార్థికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఉపాధ్యాయులు వెంటనే అతడిని ఎగ్జామ్ హాల్ నుండి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రధానోపాధ్యాయుడు హుటాహుటిన హరి సాయిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణకి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news