ఆర్.కృష్ణయ్య బీసీల కోసం కాదు.. పదవుల కోసం పోరాటం చేశారు : బుద్దా వెంకన్న

-

ఆర్.కృష్ణయ్య బీసీల కోసం కాదు.. పదవుల కోసం పోరాటం చేశారని వివాదస్ప వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతల్ని ప్రజలు తరిమికొడుతున్నందుకే కొత్తగా బీసీ మంత్రుల బస్సు యాత్ర అంటున్నారని.. చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి వస్తున్న స్పందనతో జగన్ బీసీ జపం అందుకున్నారని ఫైర్‌ అయ్యారు.

budda venkanna
budda venkanna

ఆర్.కృష్ణయ్య బీసీల కోసం పోరాటాలు చేశారా లేక తన పదవుల కోసం పోరాటం చేశారా..? టీడీపీ అమలు చేసిన ఎన్నో బీసీ సంక్షేమ పథకాలను వైసీపీ రద్దు చేసిందని గుర్తు చేశారు. వాటిని తిరిగి పునరుద్ధరించేలా జగన్ని ఒప్పించాకే ఆర్. కృష్ణయ్య రాజ్యసభ పదవి తీసుకుంటే మంచిదని.. ఇద్దరికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే రాష్ట్రంలో బీసీల సంక్షేమం అమలు చేసినట్లేనా..? అని మండిపడ్డారు.

జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా బీసీలంతా టీడీపీ పక్షానే ఉన్నారని… త్వరలోనే బీసీ నేతలంతా సమావేశమై జగన్ బీసీ వ్యతిరేక డ్రామాలను ప్రజల్లో ఎండగడతామని స్పష్టం చేశారు. తొలి విడతగా విజయవాడ, తిరుపతి, విశాఖల్లో బీసీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని…ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించిన విషయం మరిచారా అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news