చంద్రబాబు అండ్ బ్యాచ్ నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ : సీఎం జగన్

-

చంద్రబాబు అండ్ బ్యాచ్ నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో సిర్వహించిన సిద్ధం సభలో మాట్లాడారు సీఎం జగన్. ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ వైసీపీ అన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మకు ఏం సంబంధం అన్నారు. పరిపాలనలో తగ్గలేదు.. మనకు ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ కూడా తగ్గడానికి వీలు లేదన్నారు. గడప గడపకు వెళ్లి ప్రతీ ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా సిద్దమేనా అని అడిగారు.

సంక్షేమ పథకాలపై జరిగే యుద్ధానికి మీరు సిద్దమా..? ఎన్నికల శంఖం మోగుతుంది. బాబు కుట్రలు, కుతంత్రాలు చిత్తు చేసేందుకు మీ జేబులో ఉన్న సెల్ ఫోన్. సెల్ ఫోన్ తో సోషల్ మీడియా పరంగా సిద్ధంగా ఉన్నారా..? అని అడుగుతున్నాను. మీకు మరింత మంచి చేసే బాధ్యత నాది.. 175కి 175 సీట్లు రావాలన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీనే అన్నారు. మరో 60 రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఎన్నికలు పేదల భవిష్యత్ ని నిర్ణయించేవన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news