అయ్యన్నది కబ్జా కాదు.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జా – చంద్రబాబు

-

అయ్యన్నది కబ్జా కాదు.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జా అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాత్రి పూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెపుతారు?తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల భూములు చెరబట్టడం నిజమైన కబ్జా అని.. నిత్యం టీడీపీ నేతల హౌస్ అరెస్టుల పర్వం జగన్ పిరికితనాన్ని చాటుతున్నాయని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.


ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేయడం అక్రమమని.. గట్టిగా గళం వినిపిస్తున్న టీడీపీ బీసీ నేతలపై కేసులు, అరెస్టులు, ఇళ్ళపై దాడులతో జగన్ వేధించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కక్ష సాధింపు కోసం కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రతి అధికారి మూల్యం చెల్లించుకోక తప్పదని.. ప్రభుత్వ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి అధికారులు చిక్కుల్లో పడొద్దని పేర్కొన్నారు. అయ్యన్న ఇంటిపై దాడి పతనమైన జగన్ ప్రభుత్వ ఆలోచనలకు పరాకాష్ఠ అని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news