బ్రేకింగ్ : చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం

-

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద ఉన్న ఆవును తప్పించబోయి కాన్వాయ్ లోని పైలట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినట్టు గుర్తించారు. ఒక్క సారిగా కాన్వాయ్ లోని ముందు ఉన్న ఈ పైలట్ వాహనన్ని ఎస్కార్ట్ వాహనం ఢీ కొట్టడంతో ఎస్కార్ట్ వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఢీ కొట్టింది.

అయితే ఆ తర్వాతి వాహనంలో ఉన్న చంద్రబాబు క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. వాహనం ముందు భాగం బాగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. స్వల్పగాయాలతో మరో వాహనంలో భద్రతా సిబ్బంది వెళ్లినట్టు తెలుస్తోంది. అమరావతి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news