చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం – మంత్రి కారుమూరి

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం అని అన్నారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులను అప్రమత్తం చేసి నష్టపోయిన రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని.. ఇప్పుడు చంద్రబాబు వచ్చి దళారులను రైతులుగా చూపిస్తూ మాట్లాడించాడని ఆరోపించారు.

 

చంద్రబాబు లెగ్ మహిమతో అధికారంలో ఉండగా వర్షాలు లేవని ఎద్దేవా చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రతిరోజు మీటింగులు పెట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. టిడిపి నాయకులే సీఎం జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు మంత్రి కారుమూరి. అకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ లో కూడా ధాన్యం తీసుకుంటున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news