జగన్ ఇప్పుడు ఎక్కడ ముడుచుకొని కూర్చున్నారు – చంద్రబాబు

-

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన.. రేపు పెను ఉప్పెన అవుతుందన్నారు. ఆ ఉప్పెనలో ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం కొట్టుకుపోతుందని.. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు.

దెబ్బతిన్న పంటల వివరాలు ఇప్పటికీ ఎందుకు వెల్లడించడం లేదంటూ ట్వీట్ చేశారు. దెబ్బతిన్న పంట ఎంత.. కొన్న ధాన్యం ఎంత..? అనేది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతును ఆదుకోవడానికి రాకెట్ సైన్స్ చదవాలా అన్న జగన్.. ఇప్పుడు ఎక్కడ ముడుచుకుని కూర్చున్నాడు..? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news