“సై.. సై” అనాల్సిన అధినేత “నై.. నై” అంటున్నారంట!

-

చంద్రబాబు కొన్ని రోజుల క్రితం 48గంటల చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ 48గంటల్లాంటివి మరో రెండు మూడు అయిపోయినా కూడా బాబు నుంచి ఆన్ లైన్ వేదికగా ఊకదంపుడు ఉపన్యాశాలు మినహా ఏమీ రావడం లేదు! దీంతో నెట్ బ్యాలెన్స్ వేస్ట్ అనే స్థాయికి ఆయన అభిమానులు, తమ్ముళ్లూ వెళ్లిపోయారని అంటున్నారు. దీంతో… బాబుతో పాటు తాము కూడా మునిగిపోతామేమోననే బెంగ టీడీపీ నేతలకు పట్టుకుందని అంటున్నారు.

అవును… బాబు అంటే జీవితంలో అన్నీ చూసేశారు.. చినబాబుకా రాజకీయాలపై పెద్దగా అసక్తి ఉన్నట్లుగా లేదు! దీంతో… వీరిద్దరినీ నమ్ముకుంటే తమ భవిష్యత్తు అంధకారంలో పడిపొతుందని భావిస్తున్నారంట టీడీపీ నేతలు! ఇందులో భాగంగా… అమరావతికోసమని రాజినామాలు చేస్తామని అంటున్నారంట కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు! అయితే ఈ విషయంపై బాబుకు బెంగట్టుకుందని అంటున్నారు విశ్లేషకులు!

ఎవరన్నా వైకాపా లోకి రావాలని భావిస్తే… “రాజీనామా చేసి రండి” అని జగన్ క్లియర్ మెసేజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… ఇప్పుడు అమరావతి కొసమంటూ రాజినామాలు చేస్తే… ఫలితం ఊహించినట్లుగానే ఉంటుంది! దీంతో… ఆ రాజినామాను జగన్ దగ్గరకు వెళ్లడానికి వినియోగించుకుంటే సరిపోతుందని భావిస్తున్నారంట ఆ ఎమ్మెల్యేలు!

రేపు ఎలా ఉంటుందో తెలియని టీడీపీలో ఎమ్మెల్యేలుగా నిద్రలేని రాత్రులు గడపడం కంటే.. భవిష్యత్తుపై బెంగతో ఉండటంకంటే… వైకాపాలో జగన్ ఇచ్చిన హోదాలు చిన్నవైనా పెద్దవైనా అక్కడే సర్ధుకుపోతే బెటరనే ఆలోచనలు చేస్తున్నారంట టీడీపీ నేతలు! దీంతో… నేతలు రాజినామాలకు రెడీ అంటున్నప్పుడు “సై సై” అనాల్సిన అధినేత “నై నై” అంటున్నారంట!!

Read more RELATED
Recommended to you

Latest news