ఆ విషయంలో బాబు అస్త్ర సన్యాసం చేసేసినట్లే… ఇదిగో క్లారిటీ!

-

చాలామంది ఒకలా అనుకుంటే ఇంకొంతమంది మరోలా అనుకుంటే… బాబు మాత్రం ఇంకోలా చేస్తున్నారు. ఆల్ మొస్ట్ అస్త్ర సన్యాసం చేసినట్లేననే సంకేతాలు ఇస్తున్నారు. ఇంతకూ బాబు ఆ రేంజ్ లో నిర్ణయం తీసుకున్న అంశం… అమరావతి!

అవును… చంద్రబాబు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లారు. అమరావతి రైతులంతా హ్యాపీ ఫీలయ్యారు. ఇంతకాలం అమరావతి కోసం ఆన్ లైన్ లో పోరాటాలు, దీక్షలు చేసిన చంద్రబాబు… ఇక నేరుగా రంగంలోకి దిగుతారని రైతులంతా ఆశించారు. రైతులంతా అలా తలిస్తే.. బాబు మరొకటి చేశారు!

చాలా గ్యాప్ తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టిన బాబు.. కేవలం అరెస్టయ్యి బెయిల్ పై బయటకొచ్చిన తమ పార్టీ నాయకుల్ని మాత్రమే కలుసుకున్నారు! అమరావతి రైతుల్ని పక్కన పెట్టారు! రాష్ట్రంలో అన్ని సమస్యలపై మాట్లాడారు.. రాజధాని విషయాన్ని విశ్మరించారు! ఆయనకు కూతవేటు దూరంలో గతంలో తన్ను తన విజన్ ను నమ్మి భూములిచ్చిన వారి వంక కూడా చూడలేకపోయారు.

ఫలితంగా… తనకు ఇంక అమరావతి గురించి కానీ.. అమరావతి రైతుల విషయంలో కానీ స్పందించేది లేదని పరోక్షంగా తేలి చెప్పారు. కేవలం ఈ అమరావతి గురించి మాత్రమె మాట్లాడటం అంటే.. ఉత్తరాంధ్ర, సీమ పజలకు అన్యాయం చేస్తున్నామనే సంకేతాలు జనాల్లోకి వెళ్లిపోతున్నాయని గ్రహించినట్లున్నారు! ఫైనల్ గా… అమరావతి విషయంలో, రైతుల విషయంలో బాబు ఆల్ మోస్ట్ అస్త్ర సన్యాసం చేసేసినట్లే!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news