ఉగాది పండుగపై వివాదస్పద పోస్ట్‌ పెట్టిన చంద్రబాబు ?

-

Chandrababu: ఉగాది పండుగపై వివాదస్పద పోస్ట్‌ పెట్టిన చంద్రబాబు నాయుడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు. ఈ ఎన్నికల సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం.

Chandrababu posted a controversial post on Ugadi festival

అయితే నేడు మీ ఆగ్రహం…ధర్మాగ్రహం కావాలని జగన్‌ సర్కార్‌ ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై….ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందామని పోస్ట్‌ పెట్టారు బాబు. ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికీ శుభాలను కలిగించాలని, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ… ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ వెల్లడించారు. అయితే.. బాబు పోస్ట్‌ పై వైసీపీ ఫైర్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news