చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ – మంత్రి జోగి రమేష్

-

తాడేపల్లి: టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. పేదలు పేదలుగానే ఉండాలని.. పెత్తనం తమ చేతుల్లోనే ఉండాలనే స్వభావం చంద్రబాబుదన్నారు. నయా పెత్తందార్ల కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఆరోపించారు. పేదలకు భూములు ఇవ్వాలని ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు వెళ్లినప్పటికీ.. పేదలు, ప్రభుత్వ విధానమే గెలిచిందన్నారు.

jogi ramesh

51 వేలకు పైగా మందికి రేపు ఇళ్ళ పట్టాలు ఇవ్వనున్నామని వివరించారు. వీళ్ళందరికీ ప్రభుత్వం ఇళ్ళు కట్టించి ఇస్తుందన్నారు జోగి రమేష్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉంటే చంద్రబాబుకు అంటరానితనమా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు సమాధి అన్న ఆ సెంటు స్థలంలోనే పేదలు టీడీపీని సమాధి చేయనున్నారని వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు.. మిమ్మల్ని కోస్తే పసుపు రక్తం వస్తుందా..? అని ప్రశ్నించారు జోగి రమేష్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ పెద్ద ఎత్తున రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని విఙప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news