అమర్‌నాథ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు.. బాపట్లకు చంద్రబాబు

-

తన సోదరిని వేధించవద్దన్నందుకు స్నేహితుడి చేతిలో ఉప్పాల అమర్‌నాథ్‌ అనే పదో తరగతి విద్యార్థి సజీవ దహనమైన విషయం తెలిసిందే. అమర్​నాథ్ కుటుంబీకులను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు.. బాలుడి స్వగ్రామం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బాలుడి ఇంటికి చేరుకుని వారి కుటుంబీకులను పరామర్శిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ నెల 16న చెరుకుపల్లి మండలం రాజోలు వద్ద పాము వెంకటేశ్వరరెడ్డి, అతని స్నేహితులు ముగ్గురు కలిసి ట్యూషన్‌కు వెళుతున్న అమర్‌నాథ్‌ను కొట్టి పెట్రోలు పోసి నిప్పంటించడంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య ఉన్న అమర్​నాథ్ తన మరణవాంగ్మూలంలో తనపై ఆ అఘాయిత్యానికి పాల్పడిన వారి గురించి పోలీసులకు తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news