జగన్ ప్రభుత్వానికి చెన్నై కంపెనీ భారీ సహాయం !

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ విరాళాన్ని అందించింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం కంపెనీ ప్రతినిధులు కలిసి రూ.కోటి ఐదు లక్షల డిడిని అందజేశారు.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

ఈ సందర్భంగా జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ ఆర్.వీరమని మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సమర్థవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ కు స్వయంగా వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఆర్.గుణశేఖరన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news